తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం: ఏఆర్కే

Alla Rama Krishna Reddy Thanks CM YS Jagan Over Duggirala Mandal Development - Sakshi

సాక్షి, గుంటూరు: బకింగ్‌ హామ్‌ కెనాల్‌ రోడ్‌ను రూ. 200 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆమోదించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెనాలి నుంచి మంగళగిరి నేషనల్ హైవే రోడ్డు వరకు నిర్మించబోయే రోడ్డుకు త్వరలో టెండర్లు ప్రారంభమవుతాయని చెప్పారు. దుగ్గిరాల మండలంలో 18 గ్రామాల్లో రూ.70 నుంచి రూ. 80 కోట్లతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. దుగ్గిరాల మండలాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేయడానికి ఆమోదం తెలిపిన సీఎం జగన్‌కు  ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top