
డయాలసిస్ రోగులకు తప్పిన విద్యుత్ కష్టాలు
గుంతకల్లు: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ రోగులకు ఎట్టకేలకు విద్యుత్ కష్టాలు తప్పాయి. ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితిపై ఈ నెల 17న ‘సాక్షి’లో ‘పాలకుల నిర్లక్ష్యం..ప్రాణ సంకటం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన కలెక్టర్ వినోద్కుమార్ సమస్యను పరిష్కరించాలని డీసీహెచ్ఎస్ పాల్ రవికుమార్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే గుంతకల్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అజేంద్రరావుతో డీసీహెచ్ఎస్ మాట్లాడారు.డయాలసిస్ సెంటర్కు జనరేటర్ కనెక్షన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయమై అజేంద్రరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్ను రాహి కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. జనరేటర్ కనెక్షన్ ఇవ్వడంతో విద్యుత్ సమస్య తీరినట్లేనన్నారు. జనరేటర్కు అవసర మైన డీజిల్ను రాహి కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారే భరించాల్సి ఉంటుందన్నారు.
ఐటీఐ రెండో విడత
అడ్మిషన్లు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: నగరంలోని బాలుర ఐటీఐ ప్రవేశాలకు మొదటి విడతలో పూర్తయిన తర్వాత రెండో విడత ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాయపరెడ్డి కోరారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు జూలై 17 మధ్యాహ్నం ఒంటి గంటలోపు వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకున్న దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్లకు అర్హత పొందుతాయని స్పష్టం చేశారు. జూలై 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. https://iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ రాయపరెడ్డి సూచించారు.
టీబీ డ్యాంకు 43,706 క్యూసెక్కుల ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: జిల్లా ప్రజలకు హెచ్చెల్సీ (ఎగువ) ద్వారా తాగు, సాగు నీరందించే తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తింది. గురువారం సాయంత్రానికి 43,706 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. కొన్ని రోజులుగా డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ,ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. 10 రోజులుగా ఇన్ఫ్లో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. మే మొదటి వారంలో జీరోగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు 43,706 క్యూసెక్కులుగా నమోదవుతుండడం గమనార్హం. ప్రసుత్తం జలాశయంలో నీటి నిల్వ 1,633 అడుగులకు గాను 1,608.23 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 34.220 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇంకా వర్షాలు కురుస్తుండడంతో ఇన్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.
పీపీ పదవికి
హరినాథరెడ్డి రాజీనామా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచమల్లు హరినాథరెడ్డి తన పదవికి గురువారం రాజీనామా చేశారు. 2019 డిసెంబర్ 21న ఆయన జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. రాజీనామా చేసిన అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను పీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గట్టిగా వాదించి దోషులకు శిక్షలు పడేలా చేశామ న్నారు. తనను తొలగించాలని ఇటీవల ప్రభుత్వానికి కొందరు సిఫార్సు చేశారని, అయితే, ఈ విషయంలో తనకేమీ బాధ లేదన్నారు. తొలగించాల్సిన అవసరం లేకుండానే తానే పదవికి రాజీనామా చేస్తున్నాన న్నారు. రాజీనామాను ఆమోదించాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ను కోరినట్లు వెల్లడించారు.

డయాలసిస్ రోగులకు తప్పిన విద్యుత్ కష్టాలు

డయాలసిస్ రోగులకు తప్పిన విద్యుత్ కష్టాలు

డయాలసిస్ రోగులకు తప్పిన విద్యుత్ కష్టాలు