
ఉపాధిని సద్వినియోగం చేసుకోండి
యల్లనూరు: ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర బృంద సభ్యులు సూచించారు.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను గురువారం కేంద్ర బృంద సభ్యులు నవనీత, నాబార్డు కన్సల్టెంట్ వెంకటేశ్వర్లు, అడిషనల్ కమిషనర్ శివప్రసాద్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మండలంలో తిమ్మంపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.చింతకాయమంద వద్ద రూ. 35 లక్షల నిధులతో 1.6 కిలోమీటర్ల మేర నిర్మించిన ఆర్అండ్బీ రోడ్డును పరిశీలించారు. పశువుల నీటి తొట్టెలు,ఫారం పాండ్లు, కందకం పనులపై అడిషనల్ కమిషనర్ శివప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. ఏ పనికి ఎన్ని నిధులను మంజూరు చేశారు.. ఎంత ఖర్చు చేశారు తదితర వివరాలపై ఆరా తీశారు. ఫారంపాండ్ల వద్ద మొక్కలు నాటారు. రైతులతో కాసేపు మాట్లాడారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గడ్డంవారిపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కేంద్ర బృంద సభ్యురాలు నవనీత మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ఆవశ్యకతను వివరించారు. అనంతరం తిమ్మంపల్లి సచివాల యం తనిఖీ చేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీం భాష, పంచాయతీ రాజ్ డీఈ కృష్ణ జ్యోతి, ఏపీడీ పుల్లా రెడ్డి, ఎంపీడీఓ కరుణ సాగర్, ఈసీ సత్య మూర్తి, టెక్నికల్ అసిస్టెంట్ జయరాం, పురుషోత్తం నాయుడు, చంద్రశేఖర్రెడ్డి, హరి కుమార్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరులో..
ఆత్మకూరు: మండల కేంద్రం సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. పనులు ఎంత మేర చేశారు.. ఏ పనికి ఎంత కూలీ వర్తిస్తోంది తదితర వివరాలను బృంద సభ్యులు నవనీత్ దాస్, శంకర్, గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. పర్కులేషన్ ట్యాంక్, హార్టికల్చర్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుధాకర్రెడ్డి, ఎంపీడీఓ విజయలక్ష్మి ఏపీఓ వెంకటనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.