
5,967 కేంద్రాల్లో యోగా దినోత్సవం
అనంతపురం అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న జిల్లావ్యాప్తంగా 5,967 రిజిస్టర్ కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ వెల్లడించారు. 10 లక్షల మందితో యోగా దినోత్సవం నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు.జిల్లాలో ‘యోగాంధ్ర’ కింద 9,97,518 మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా 100 మంది మాస్టర్ ట్రైనర్లు, 6,504 మంది ట్రైనర్లు రిజిస్టర్ అయ్యారన్నారు. 21న ఉదయం 7 గంటలకు జిల్లాలో రిజిస్టర్ అయిన కేంద్రాల్లో యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. జిల్లాస్థాయి కార్యక్రమంలో పీటీసీ మైదానంలో 5 వేల మంది పాల్గొంటార న్నారు. ‘యోగాంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీల్లో వివిధ కేటగిరీల్లో జిల్లాకు చెందిన 27 మంది బహుమతులు సాధించారన్నారు. 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే కార్యక్రమంలో వారంతా పాల్గొంటారన్నారు. జిల్లావ్యాప్తంగా రిజిస్టర్ అయిన పౌరులందరూ పాల్గొనాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి రామ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వినోద్కుమార్