కరువు నివారణకు ప్రణాళికలు | - | Sakshi
Sakshi News home page

కరువు నివారణకు ప్రణాళికలు

Jun 18 2025 3:25 AM | Updated on Jun 18 2025 3:25 AM

కరువు నివారణకు ప్రణాళికలు

కరువు నివారణకు ప్రణాళికలు

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌

అనంతపురం అర్బన్‌: ‘కరువు నివారణే లక్ష్యంగా కార్యాచరణ ఉండాలి. ఇందుకు సంబంధించి గ్రామస్థాయి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేయాలి’ అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో కరువు సంక్షోభ నివారణ జిల్లాస్థాయి కమిటీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయం చేసుకుని రోడ్లకిరువైపులా, కాలువలు, పొలంగట్ల వెంబడి విస్తృతంగా మొక్కలు నాటాలన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలని సూచించారు. ఉపాధి పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, జెడ్పీ సీఈఓ రామసుబ్బయ్య, డ్వామా పీడీ సలీంబాషా, సీపీఓ అశోక్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు

అనంతపురం అర్బన్‌: ‘ఆస్పతుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది’ అంటూ కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వైద్యులు, వైద్యమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రోజూ రెండు ఆస్పత్రులను తనిఖీ చేయాలని ఎన్టీఆర్‌ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్‌, డీసీహెచ్‌ఎస్‌లను ఆదేశించారు. సమావేశంలో వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ పాల్‌రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement