
నెట్టికంటుడి హుండీ కానుకల లెక్కింపు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. 83 రోజులకు గానూ రూ. 81,39,461 లక్షల నగదు, అన్నదానం హుండీ ద్వారా రూ.44,173 నగదుతో పాటు 10 అమెరికన్ డాలర్లు,0.014 గ్రాముల బంగారం, 2.960 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ కె.వాణి తెలిపారు. ఈ ప్రక్రియను ఆలయ ఏఈఓ వెంకటేశ్వర్లు, సిబ్బంది, పోలీసుల సమక్షంలో వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వీరభద్రసేవా సమితి, హనుమాన్ సేవా సమితి, రాఘవేంద్ర సేవా సమితి, శ్రీరామ సేవాసమితి సభ్యులు చేపట్టారు.