
హైస్కూల్ చదువు.. ఉఫ్!
పామిడి: చంద్రబాబు సర్కారు నిర్ణయం ఆ పిల్లలకు అవస్థలు తెచ్చిపెట్టింది. తల్లిదండ్రులకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే ఉన్న పాఠశాల స్థాయిని పెంచకుండా.. ఉన్నదాన్ని కూడా తగ్గించడంపై మండిపడుతున్నారు. వివరాలు.. పామిడి మండలం రామగిరిలో ఏర్పాటు చేసిన ప్రైమరీ పాఠశాలను గతంలో యూపీగా, తర్వాత హైస్కూల్గా అప్గ్రేడ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమం కింద రూ.65 లక్షలతో పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
కూటమి సర్కారు నిర్ణయం..
తల్లిదండ్రుల ఆగ్రహం..
ఇటీవల పాఠశాల విద్యలో సంస్కరణలకు తెరలేపిన కూటమి సర్కారు.. అందులో భాగంగా ఏవేవో సాకులతో రామగిరి పాఠశాల హోదాను తగ్గించింది. ప్రైమరీ స్కూల్గా డీగ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ ఉన్న హైస్కూల్ను ప్రాథమిక పాఠశాలగా స్థాయి తగ్గించడంపై పిల్లల తల్లిదండ్రుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్థలం లేదన్న సాకుతో చెత్త నిర్ణయం తీసుకున్నారంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. పిల్లలు హైస్కూల్ చదువులు చదవకుండా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా నిత్యం పాఠశాల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చంద్రబాబు సర్కారు నిర్వాకం
రామగిరి స్కూల్ హోదా తగ్గింపు
ప్రభుత్వ తీరుపై గ్రామస్తుల కన్నెర్ర