కమనీయం దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణం

Jun 20 2025 5:40 AM | Updated on Jun 20 2025 5:40 AM

కమనీయ

కమనీయం దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణం

అనకాపల్లి: స్థానిక గవరపాలెం శతకంపట్టు కనకదుర్గమ్మ ఆలయంలో దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు బోగారపు వెంకటరమణ, ఉదయగిరి చంద్రశేఖర్‌ గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. మల్లేశ్వరస్వామి తరఫున మళ్లరాజు లహరి దంపతులు, దుర్గాదేవి అమ్మవారి తరఫున బొడ్డేడ బాలసుబ్రహ్మణ్యం శ్రీలక్ష్మి దంపతులు కూర్చుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పెండ్లి కూతురుగా అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్‌ కాండ్రేగుల నాయుడు, భాగ్యలక్ష్మి దంపతులు ముస్తాబు చేశారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కల్యాణాన్ని తిలకించి, ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు పి.వి.రమణ, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌ భీమరశెట్టి వరాహ నూకరాజు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, గౌరీపరమేశ్వరుల కమిటీ సభ్యులు, మరిడిమాంబ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కమనీయం దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణం 1
1/1

కమనీయం దుర్గా మల్లేశ్వరస్వామి కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement