
బల్క్డ్రగ్పార్క్ పనులు వేగవంతం
కలెక్టర్ విజయ్కృష్ణన్
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో జరుగుతున్న బల్క్ డ్రగ్ పార్క్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఆమె రాజయ్యపేట,చందనాడ, బోయపాడు ,డీఎల్పురం, మూలపర తదితర గ్రామాల పరిధిలో జరుగుతున్న బల్క్ డ్రగ్పార్క్ పనులు పరిశీలించారు. మండలంలో రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో బల్క్డ్రగ్పార్క్ ఏర్పాటుకాబోతున్న విషయం తెలిసిందే. వివిధ రసాయన కంపెనీల యాజమాన్యాలు ఇక్కడ బల్క్డ్రగ్ యూనిట్లు స్థాపించేందుకు ఆసక్తి చూపించాయి. దీంతో ఏపీఐఐసీ ముందుగా డ్రగ్పార్క్ కోసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. సుమారు రూ.1100 కోట్ల వ్యయంతో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, వాడుకనీటి సదుపాయాలు, విద్యుత్ సరఫరా కల్పించాలి, జాతీయరహదారినుంచి కనెక్టవిటీ రోడ్లునిర్మించాలి. ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలుకల్పించే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. బల్క్డ్రగ్ పార్క్ నిర్మించే ప్రాంతంలో సుమారు 24 కిలోమీటర్ల మేర అంతర్గత రోడ్లు నిర్మిస్తున్నారు. కల్వర్టులు, బ్రిడ్జిలు, తారు రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, భూగర్భ డ్రైయినేజీ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులు జరుగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ ఈ గ్రామాల పరిధిలో ఏయే పనులు చేపట్టాలి, ఇంతవరకు ఏయే పనులు ప్రారంభమయ్యాయి. ఎంతవరకు పూర్తయ్యాయి అనే వివరాలను ఏపీఐఐసీ ఆధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే సబ్స్టేషన్ పనులు కూడా ప్రారంభించాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలోనే ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసే స్టీల్ప్లాంట్కు కూడా 2,500 ఎకరాలు భూములు కేటాయించినట్టు చెప్పారు. అక్కడ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. బల్క్డ్రగ్ పార్క్ విస్తరణ కోసం అదనంగా మరో వెయ్యి ఎకరాలు సేకరించాల్సి ఉందని, ఆప్రక్రియ కూడా పూర్తిచేయాలన్నారు. ఏపీఐఐసీ వారి ఆధ్వర్యంలో చేపట్టిన పనులను జోనల్మేనేజర్ నర్సింగరావు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వివిరమణ, తహసీల్దార్ నర్సింహమూర్తి, అధికారులు పాల్గొన్నారు.