
భూతగాదా
ఒకరికి గాయాలు
● వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ కార్యకర్తల దాడి ● ఎం.అలమండలో ఘటన
దేవరాపల్లి: మండలంలోని ఎం.అలమండ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త యర్రా నర్సింహమూర్తిపై టీడీపీకి చెందిన సింగంపల్లి పోలినాయుడు, లక్ష్మి దంపతులు బుధవారం దాడి చేశారు. భూతగాదా విషయంలో కత్తితో దాడి చేయడంతో నర్సింహమూర్తి తీవ్ర గాయాలుపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నర్సింహమూర్తి తన పొలంలో పనులు చేసుకుంటుండగా టీడీపీకి చెందిన సింగంపల్లి పోలినాయుడు, లక్ష్మి దంపతులు దాడి చేశారు. భార్య లక్ష్మి కళ్లల్లో కారం కొట్టగా, భర్త పోలినాయుడు కత్తితో దాడి చేసినట్టు బాధితుడు చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు దేవరాపల్లి పీహెచ్సీకి తరలించారు. ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తనపై దాడి చేసిన భార్యాభర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పాటు వారి నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు నర్సింహమూర్తి తెలిపారు. ఇరువురి మధ్య భూతగాదాలు, కొట్లాట కేసులు కోర్టులో నడుస్తున్నట్లు సమాచారం.