
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత
గొలుగొండ: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, విద్యార్థులు ఇంటి వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని సోషల్ ఫారెస్టు డీఎఫ్వో లక్ష్మణ్ తెలిపారు. ఏఎల్పురంలో బుధవారం వన సంరక్షణ– మన సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏఎల్పురం గ్రామంతో పాటు అల్లూరి పార్కు వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ సోషల్ ఫారెస్టు పరిధిలో ఎక్కువ మొక్కలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని ప్రతి పాఠశాల, ఇంటి పరిసరాల వద్ద, ఖాళీగా ఉన్న స్థలాల్లో నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేంజర్ సుబ్బారావు,సెక్షన్ అధికారి రాజు, మాజీ జెడ్పీటీసీ తారకవేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.