
రేవుపోలవరం తీరంలో యోగాంధ్ర
ఎస్.రాయవరం: ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి వగలపూడి అనిత అన్నారు. రేవుపోలవరం తీరంలో బుధవారం ఉదయం వెయ్యి మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితో పాటు కలెక్టర్ విజయ్కృష్ణన్, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు, నర్సీపట్నం ఆర్డీవో వి.వి.వి. రమణ, తహసీల్దార్ రమేష్బాబు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు.ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉంటేనే విజయాలు సాధించవచ్చన్నారు.