గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

Jun 19 2025 4:32 AM | Updated on Jun 19 2025 4:32 AM

గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

గడ్డి మందు తాగిన వ్యక్తి మృతి

మునగపాక: మండలంలోని ఒంపోలు పేట గ్రామానికి చెందిన వ్యక్తి గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వివరాలను ఎస్‌ఐ ప్రసాదరావు విలేకరులకు తెలిపారు. ఒంపోలుపేటకు చెందిన బొడ్డేడ రాజా వెంకట ప్రసాద్‌ (48) కొంతకాలంగా మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు. రెండు రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అతనిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసాద్‌ మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement