
స్వల్ప వివాదమే కాల్పులకు కారణం
నాటుతుపాకీతో అన్నను చంపిన నిందితుడు అరెస్టు
చీడికాడ: స్వల్ప వివాదమే కాల్పులకు కారణమని తురువోలు ఘటనపై కె.కోటపాడు సీఐ పైడపునాయుడు తెలిపారు. ఈ సంఘటనపై బుధవారం ఆయన చీడికాడ పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని తురువోలుకు చెందిన మృతుడు జోగా రాము(48), దేముళ్లు అన్నదమ్ములు కాగా, మంగళవారం సాయంత్రం గ్రామంలో ఒడ్డు పండగ చేసుకుని వీరిద్దరూ కళ్లానికి వెళ్లారు. అక్కడ ఆవు వద్ద పాలు తాగేస్తున్న దూడపెయ్యిను మద్యం మత్తులో ఉన్న తమ్ము డు దేముళ్లు కర్రతో కొట్టాడు. దానికి మృతుడు రాము వారించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వివాదం తలె త్తగా, పాకలో ఉన్న నాటు తుపాకీని తెచ్చి అన్నపై కాల్చాడు. దాంతో ఛాతి కింద గాయమై మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు.
లైసెన్సు లేని నాటుతుపాలుంటే అప్పగించాలి: సీఐ
లైసెన్సు లేకుండా ఎవరి వద్దనైనా నాటుతుపాకీలుంటే వారంలోగా పోలీసు స్టేషన్లకు అప్పగించాలని సీఐ పైడపునాయకుడు తెలిపారు. పది రోజుల తర్వాత గ్రామాల్లో చర్చ జరుగుతుందని, అప్పుడు పట్టుబడితే కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మాడుగుల ఎస్సై నారాయణరావు పాల్గొన్నారు.

స్వల్ప వివాదమే కాల్పులకు కారణం