
బుచ్చెయ్యపేట ఎంపీడీవో మృతి
బుచ్చెయ్యపేట: విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఎంపీడీవో వి. విజయలక్ష్మి(61) మృతి చెందారు. ఈ నెల 14న బుచ్చెయ్యపేటలో విధులకు హాజరైన ఆమె అదే రోజు రాత్రి తన ఇంట్లో బాత్రూంలో కాలు జారి పడిపోయి తలకు తీవ్ర గాయమైన విషయం విదితమే. కుటుంబ సభ్యులు వెంటనే విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు. మృతి వార్త తెలుసుకున్న జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కె. అచ్చింనాయుడు, తహసీల్దార్ లక్ష్మి, ఈవోపీఆర్డీ విజయలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు విశాఖ తరలివెళ్లి ఎంపీడీవో మృతదేహం వద్ద నివాళులర్పించారు. బుచ్చెయ్యపేటలో ఆరేళ్లుగా ఆమె ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేశారు. ఈమె భర్త మల్లికార్జునరావు పార్వతీపురం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా, పెద్ద కుమారుడు హైదరాబాద్లో, చిన్న కుమారుడు చైనాలో ఉన్నారు. మరో మూడు నెలల్లో పెద్ద కుమారుడికి వివాహం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా, ఇంతలో ఆమె మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. గురువారం ఉదయం ఇసుకతోటలో ఎంపీడీవో పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బుచ్చెయ్యపేట ఎంపీడీవో మృతి