
ఎన్టీఆర్ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు
అనకాపల్లి టౌన్: కిడ్నీ వ్యాధి రోగులు కేజీహెచ్కు వెళ్లనవసరం లేకుండా ఎన్టీఆర్ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ద్వారా సేవలందిస్తున్నామని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ డాక్టర్ డీడీ నాయుడు తెలిపారు. పట్టణంలోని ఎన్టీఆర్ ఆస్పత్రిని ఆయన బుధవారం పరిశీలించారు. ఇక్కడ కిడ్నీవ్యాధి రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిడ్నీ ఫెయిలైన రోగులు ఎక్కువగా వస్తున్నారని, వీటి లక్షణాలు ముందుగా గ్రహించుకొని వైద్యులను సంప్రదించాలన్నారు. నడుము నొప్పి, శరీరంలో వాపు, నీరుడు, గాబరాగా ఉండడం, రక్తహీనత, ఆయాసం, వాంతులు తదితర లక్షణాలు కిడ్నీ ఫెయిల్యూర్కు సంకేతాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు, రామచంద్రరావు, గొర్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ డాక్టర్ డీడీ నాయుడు