
అనకాపల్లిలో మంత్రుల సమీక్ష
అనకాపల్లి: విశాఖ నగరంలో ఈ నెల 21న ఉదయం 7 గంటలకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆ రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తారన్నారు. జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు యోగాలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై మంగళవారం ఆయన కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.