అనకాపల్లిలో మంత్రుల సమీక్ష | - | Sakshi
Sakshi News home page

అనకాపల్లిలో మంత్రుల సమీక్ష

Jun 18 2025 11:14 AM | Updated on Jun 18 2025 11:14 AM

అనకాపల్లిలో మంత్రుల సమీక్ష

అనకాపల్లిలో మంత్రుల సమీక్ష

అనకాపల్లి: విశాఖ నగరంలో ఈ నెల 21న ఉదయం 7 గంటలకు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆ రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తారన్నారు. జిల్లా నుంచి అన్ని వర్గాల ప్రజలు యోగాలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement