వివాదాస్పదమైన 334 ఎకరాల రిజిస్ట్రీ రద్దు చేయాలని ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వివాదాస్పదమైన 334 ఎకరాల రిజిస్ట్రీ రద్దు చేయాలని ఫిర్యాదు

Jun 17 2025 5:10 AM | Updated on Jun 17 2025 5:10 AM

వివాదాస్పదమైన 334 ఎకరాల రిజిస్ట్రీ రద్దు చేయాలని ఫిర్యా

వివాదాస్పదమైన 334 ఎకరాల రిజిస్ట్రీ రద్దు చేయాలని ఫిర్యా

తుమ్మపాల: నక్కపల్లి మండలం పెద్దదొడ్డిగుళ్లలో రైతులకు చెందిన 334 ఎకరాల వివాదాస్పద భూమిని రాజకీయ నాయకుడు సుబ్బరాజు తప్పుడు మార్గంలో చేయించుకున్న (ఇర్రివోకబుల్‌) జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ దస్తావేజును రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సర్పంచ్‌ బొర్ల విజయలక్ష్మితో కలిసి గ్రామస్తులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు సీరం నర్సింమూర్తి ఆధ్వర్యంలో కలెక్టర్‌ విజయ కృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నంబరు1లో రైతులు సాగు చేసుకుంటున్న 334 ఎకరాలను 2019 నుంచి వివాదంలో ఉందని స్థానిక రెవెన్యూ అధికారులు ధ్రువీకరించినప్పటికీ సుబ్బరాజు లాంటి నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సదరు వ్యక్తి విజయవాడలో తప్పుడు జీపీఏలు రిజిస్ట్రీ చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సదరు భూమికి సమీపంలో ఫారెస్టు అధికారుల లేఖలపైనా సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. రైతుల హక్కులకు ఎటువంటి ఆటంకం కలగకుండా న్యాయం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement