
తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ క్రీడాకారులకు అభినందనలు
చోడవరం: ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ తైక్వాండో క్రీడలో ప్రావీణ్యం సంపాదించాలని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి అన్నారు. ఇటీవల తైక్వాండో క్రీడలో బ్లాక్ బెల్ట్ సాధించిన క్రీడాకారులను చోడవరంలో ఆదివారం ఆయన అభినందించారు. ఇటీవల తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ టెస్టు పరీక్షల్లో చోడవరం పరిసర ప్రాంత క్రీడాకారులు పలువురు ఎంపికయ్యారు. ఈ పరీక్షల్లో సిహెచ్ వెంకటేష్, సంతోషికుమారి, ఎస్.శారద, గండి రిషిత, రాఘవ, డి.జాన్మార్క్ సాగర్, ఎం.హేమశ్రీ, జి.వి.శశివర్థన్ కుమార్, వి.జెస్సిక రోజా, జయంత్లు ఎంపికయ్యారు. వీరిని అసోసియేషన్ తరపున అభినందించారు. కార్యక్రమంలో కోచ్లు గండి శేఖర్బాబు, కె.ప్రదీప్కుమార్ శేఖర్, సింహాచలం పాల్గొన్నారు.