మత్స్యకారుల ఆశలు.. అడియాసలు | - | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు

Jun 16 2025 5:33 AM | Updated on Jun 16 2025 5:33 AM

మత్స్

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు

అర్ధంతరంగా ఆగిపోయిన జెట్టీ నిర్మాణ పనులు

నిత్యం గండాలు..

మత్స్యకారులు నడి సముద్రంలోకి వెళ్లాక ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ తుపానులో చిక్కుకుంటే పడవలో ఎవరైనా సాంకేతికత పరంగా అవగాహన ఉన్న వారు ఉంటే ఒకింత ఫరవాలేదు. కానీ, సాంకేతికతపై అవగాహన లేని వారు వేటకు వెళ్లినట్టయితే తీరం వైపు కాకుండా పొరపాటున తీరానికి వ్యతిరేక దిశగా వెళ్తే వారు ఇక సముద్రంలో గల్లంతైనట్టే. దూరం వెళ్లే కొద్దీ బోట్లలో ఆయిల్‌ అయిపోతుంది, వారు తినడానికి తీసుకువెళ్లిన ఆహారం నిండుకుంటుంది. అదృష్టవశాత్తూ ఏదైనా పెద్ద బోట్లు తారసిల్లితే తప్ప వారు బతికి బయటపడే అవకాశం చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు తమ ప్రాణాలు పణంగా పెట్టి వేట కొనసాగిస్తుంటారు.

జెట్టీ నిర్మాణ పనులు పూర్తవుతాయి..

తమ జీవితాలు బాగుపడతాయి అనుకున్న

పూడిమడక మత్స్యకారుల ఆశలు అడియా

సలయ్యాయి. కూటమి ప్రభుత్వం రావ

డంతో జెట్టీ నిర్మాణ పనులు అర్ధంతరంగా

ఆగిపోయాయి. మొదలు పెట్టిన ఒకటిన్నర

సంవత్సరంలో పూర్తి కావాల్సిన జెట్టీ నిర్మాణ

పనులు కూటమి ప్రభుత్వ రావడంతో నిలిచి

పోయాయి. మత్స్యకారులు ఆర్థ్ధికంగా ఎదగా

లనే సదుద్దేశంతో మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌

మోహన్‌రెడ్డి 2023లో పూడిమడకలో జెట్టీ

నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పనులు చేప

ట్టారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో

మొదలుపెట్టిన జెట్టీ నిర్మాణ పనులు ఏడాది

పాటు చురుగ్గా సాగి ప్రభుత్వం మారగానే

నిలిచిపోయాయి. దీంతో మత్స్యకారుల

ఆశలపై నీళ్లు జల్లినట్టయింది.

అచ్యుతాపురం రూరల్‌: అనకాపల్లి జిల్లాలో పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో సుమారు 50 నుంచి 60 వేల మత్స్యకార కుటుంబాలు కేవలం మత్స్య సంపదపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. తీర ప్రాంతాలైన తిక్కవానిపాలెం, ముత్యాలమ్మపాలెం, వాడచీపురుపల్లి, తంతడి, పూడిమడక, లోవపాలెం, వెంకయ్యపాలెం, రాంబిల్లి, వాడ నర్సాపురం, కొత్తపట్నం, బంగారమ్మపాలెం, రేవుపోలవరం, రాజయ్యపేట, తీనార్లు, దొండాక, బోగుపాడు వంటి మరెన్నో మత్స్యకార గ్రామాల ప్రజలు మత్స్య సంపదపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరంతా పూడిమడక కేంద్రంగా జెట్టీ ఏర్పడుతుంది.. ఇకనైనా తమ జీవితాలు బాగుపడతాయనుకున్నారు.

ప్రాణాలు పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు తిరిగి ఇంటికి చేరుకునే వరకూ సముద్రంతో యుద్ధం చేస్తూనే ఉంటారు. రోజుల తరబడి సముద్రంపైనే ఉంటూ క్షణం ఒక గండంగా ఆటుపోట్ల మధ్య తీవ్ర క్లిష్ట పరిస్థితిలో వేట సాగిస్తారు. జెట్టీ ఉన్నట్టయితే పెద్ద బోట్ల సాయంతో నెలల తరబడి సముద్రంలో వేట సాగించి, తీరంలో సులభంగా నిలకడ చేసుకునేందుకు వీలు కుదురుతుంది. తద్వారా అధికంగా చేపలవేట జరపడానికి అనుకూలంగా ఉంటుందన్న మత్స్య కారులు ఆశలు కూటమి ప్రభుత్వంలో అడియాసలయ్యాయి. ఆర్థ్ధికంగా స్థిరపడే అవకాశాలు కోల్పోవడం మత్స్యకారులను మానసికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

ఆర్థికాభివృద్ధికి దోహదం

జెట్టీ నిర్మాణం జరిగితే మత్స్యకారులు ఆర్థికంగా స్థిరపడతారు. మత్స్య సరఫరా కూడా పెరుగుతుంది. దానికి అనుబంధంగా ఐస్‌ ఫ్యాక్టరీలు, థర్మాకోల్‌ బాక్స్‌ పరిశ్రమలు ఇలా పలు రకాల కుటీర పరిశ్రమలు ఎన్నో స్థాపితమవుతాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కేవలం పూడిమడక గ్రామమే కాకుండా చుట్టు పక్కల ఎన్నో గ్రామాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు వంటివి ఏర్పాటవుతాయి. వాణిజ్య సముదాయాలు మెరుగుపడతాయి. పూర్తిగా మత్స్యకారుల జీవన విధానం మారుతుంది. ఈ నేపథ్యంలో నిలిపివేసిన జెట్టీ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని మత్స్యకారులు డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

అర్ధంతరంగా ఆగిపోయిన జెట్టీ నిర్మాణ పనులు పైప్‌లైన్ల కారణంగా క్షీణిస్తున్న మత్స్య సంపద మరోవైపు ఉపాధి అవకాశాలు శూన్యం ఆర్థికాభివృద్ధికి నోచుకోని జిల్లా మత్స్యకారులు

పైప్‌లైన్ల కారణంగా మత్స్య సంపదకు విఘాతం

బ్రాండిక్స్‌, ఏపీఐఐసీ పైప్‌లైన్‌ వేయడంతో సము ద్ర తీరం నుంచి కిలోమీటర్ల మేర జలాలు వ్యర్ధ రసాయనాల కారణంగా కలుషితమైపోవడంతో మత్స్య సంపద తగ్గిపో తోంది. మత్స్యకారులు వందల మైళ్ల దూరం వేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లి వేట సాగించవలసి వస్తుంది.మత్స్యకారులకు ప్రభుత్వాలు రాయితీలు కల్పించడమే కాకుండా జెట్టీ నిర్మిస్తే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

–చోడిపల్లి అప్పారావు, వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

జెట్టీ నిర్మిస్తే మా బతుకుల్లో వెలుగు

గత 6 నెలలుగా సబ్సిడీ డీజిల్‌ ఆయిల్‌ బంక్‌ మూత పడడంతో మత్స్యకారులకు బోట్లలో ఉపయోగించే డీజిల్‌ ఆయిల్‌పై కూడా అధిక భారం పడింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మారినప్పటి నుంచి జెట్టీ నిర్మాణ పనులు చేపట్టలేదు. దెబ్బ మీద దెబ్బ పడతుండడంతో ఆర్థికంగా ఎదగలేని పరిస్థితి పూడిమడక మత్స్యకారుల్లో నెలకొంది. జెట్టీ నిర్మాణం పూర్తి అయితే పూడిమడకలో వ్యాపారాలు పెరిగి గ్రామస్తులందరూ ఆర్థ్ధికంగా స్థిరపడే అవకాశం ఉండేది. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేందుకు జెట్టీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరుకుంటున్నాను.

–ఉమ్మిడి అప్పారావు, పూడిమడక మత్స్యకార నాయకుడు

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు1
1/4

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు2
2/4

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు3
3/4

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు4
4/4

మత్స్యకారుల ఆశలు.. అడియాసలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement