
యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి
తుమ్మపాల: రోజూ యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని జిల్లా సమాచార పౌర సంబంధాలశాఖ అధికారి ఎస్.వి.రమణ అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సెలబ్రిటీ యోగా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు మంగయ్య, యోగా శిక్షకులు జ్యోతి, లక్ష్మి అందరితో యోగాసనాలు వేయించారు. ఈ సందర్భంగా డీఐపీఆర్వో రమణ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈకార్యక్రమంలో ఏషియన్ బ్రాంజ్ మెడలిస్ట్ బాక్సర్ కుసుమ, సహాయ సమాచార ఇంజినీర్ బాలాజీ, జూనియర్ సహాయకులు పి.డి.ఎస్.ఎన్. మూర్తిపాల్గొన్నారు.