
యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు 32 మంది
తుమ్మపాల: యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 32 మంది సభ్యుల బృందం హాజరు కానున్నట్టు జిల్లా క్రీడల శాఖ అధికారి ఎల్.వెంకటరమణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ నెల 16 నుంచి జూనియర్స్, యంగ్, సీనియర్స్ విభాగాల్లో సోలో యోగా, గ్రూప్ యోగా, చిత్ర లేఖనం, పాటలు, పోస్టర్ డిజైన్, వ్యాసరచన తదితర పోటీలు జరుగుతాయని చెప్పారు. జిల్లా నుంచి ఐదుగురు బాలురు, 23 మంది మహిళలు, నలుగురు అఫీషియల్ సభ్యులు హాజరవుతున్నట్టు తెలిపారు. వీరు మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 20న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుందన్నారు.