
నీట్లో మామిడిపల్లి విద్యార్థి ప్రతిభ
దేవరాపల్లి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్లో మండలంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన పోతల భానుచందు ప్రతిభ చూపాడు. శనివారం విడుదలైన ఫలితాల్లో 528 మార్కులు సాధించి, 25,241 ర్యాంక్ పొందాడు. తల్లిదండ్రులు ఈశ్వరావు, చెల్లయ్యమ్మ వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుమారుడుతో పాటు కుమారైను చదివిస్తున్నారు. భానుచందు ఇంటర్లో 980 మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా భానుచందు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా బాగా చదివి మంచి వైద్యుడుగా పేరు సంపాదించుకుంటానని తెలిపారు.