ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా.. | - | Sakshi
Sakshi News home page

ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..

Jun 15 2025 7:58 AM | Updated on Jun 15 2025 7:58 AM

ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..

ఏటా 3 వేల మందికి చికిత్స అందించేలా..

సీఐసీఐ ఫౌండేషన్‌ బ్లాక్‌ ఫర్‌ చైల్డ్‌ అండ్‌ బ్లడ్‌ క్యాన్సర్‌ భవనాన్ని 8 అంతస్తుల్లో సుమారు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఈ కొత్త భవనంలో 555 పకడలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం అగనంపూడిలో ఉన్న హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్‌ క్యాన్సర్‌ రోగులు, 350–400 మంది హెమటోలింఫాయిడ్‌ క్యాన్సర్‌ పేషంట్లు వైద్య సేవలు పొందుతున్నారు. కొత్త బ్లాక్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో పాటు ప్రస్తుత వైద్య సేవలను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యునోథెరపీకి వెసులుబాటు కలగనుంది. మరో 3 వేల మంది క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త బ్లాక్‌ల్లో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉండనున్నాయి. పెరుగుతున్న క్యాన్సర్‌ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2027 నాటికి ఈ కొత్త బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement