
అర్హత ఉన్నా రాలేదు..
మాది నిరుపేద కుటుంబం. పొట్టకూటి కోసం కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాను. నాకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు చదువుకోలేదు. చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ 9వ తరగతి పూర్తి చేసుకుని పదో తరగతిలోకి వచ్చాడు. ప్రతి రోజూ స్కూల్ వెళ్లేవాడు. హాజరు శాతం ఎక్కువగానే ఉంటుంది. మాకు కారు లేదు. కరెంట్ బిల్లు 200 మించిరాదు. కానీ తల్లికి వందనం ఇప్పటివరకు పడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లపాటు అమ్మ ఒడి అందుకున్నాను. పేపర్లో వార్త చదివి బ్యాంకుకు వెళ్లి అడిగితే ఇంకా పడలేదు అన్నారు.
– కోరుకొండ నూకరత్నం, పూసర్ల వీధి, కశింకోట మండలం