యూపీఎస్‌సీకి ఎంపికై న దీపక్‌ | - | Sakshi
Sakshi News home page

యూపీఎస్‌సీకి ఎంపికై న దీపక్‌

Jun 15 2025 7:57 AM | Updated on Jun 15 2025 7:57 AM

యూపీఎస్‌సీకి ఎంపికై న దీపక్‌

యూపీఎస్‌సీకి ఎంపికై న దీపక్‌

నర్సీపట్నం : కేంద్ర సాయుధ బలగాల్లో ఉన్నతాధికారుల నియామకం కోసం నిర్వహించే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో కోటవురట్ల మండలం, వేములపూడికి చెందిన దేవాడ దీపక్‌ విజయం సాధించారు. బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి సాయుధ దళాల్లో అధికారుల నియామకం కోసం ఏటా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఈ పరీక్షలు నిర్వహిస్తుంది. 2024 సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో రాత, మౌఖిక, శారీరక దృఢ పరీక్షల్లో దీప క్‌ జాతీయస్థాయిలో 105వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకుతో దీపక్‌ ఏదో ఒక సాయుధ దళంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ హోదాలో నియమితులు కానున్నారు. దీపిక్‌ తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి చంద్రావతి గృహిణి. దీపక్‌ పదో తరగతి విశాఖపట్నంలో శ్రీచైతన్య, ఇంటర్‌ విజయవాడ శ్రీచైతన్యలో చదివారు. అగర్తల ఎన్‌ఐ టీలో 2019లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో బీ టెక్‌ పూర్తి చేశాడు. అనంతరం తండ్రి ప్రోత్సాహంతో సివిల్స్‌ సాధనపై దృష్టి సారించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి సాయుధ బలగాలకు ఎంపికయ్యారు. సాయుధ బలగాలకు ఎంపిక కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే సివిల్స్‌ సాధనకు ప్రయత్నిస్తానని దీపక్‌ చెప్పాడు. కేంద్ర బలగాలలో సీఐఎస్‌ఎఫ్‌లో అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీపక్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement