మోకాళ్లపై నిరసన | - | Sakshi
Sakshi News home page

మోకాళ్లపై నిరసన

Jun 15 2025 7:57 AM | Updated on Jun 15 2025 7:57 AM

మోకాళ్లపై నిరసన

మోకాళ్లపై నిరసన

రావికమతం: ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు అన్నారు.ి శనివారం సీపీఎం ఆధ్వర్యంలో కొత్తకోట బీఎన్‌ రోడ్డుపై మోకాళ్లపై వినూత్నంగా నిరసన తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్డు పనులు పూర్తి చేస్తామని చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారని, ఇప్పటికీ నెరవేర్చలేదని గోవిందరావు అన్నారు. వడ్డాది, విజయరామరాజుపేట బ్రిడ్జిలు, నర్సీపట్నం నుంచి చోడవరం వరకు రోడ్డు పనులు తక్షణమే చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ రోడ్లపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రోడ్డు పనులు, వడ్డాది, విజయరామరాజుపేట బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు గేమిల వాసు, సింగారపు వలసయ్య, పి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

బీఎన్‌ రోడ్డు పూర్తి చేయలేదని ఎద్దేవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement