
రూ.300 బిల్లును 300 యూనిట్లుగా రాశారు
మా పాప ప్రణతి ప్రభుత్వ పాఠశాలలోను, మా అబ్బాయి కోట యశ్వంత్ ప్రైవేటు పాఠశాలలోను చదువుతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి ఏటా అమ్మ ఒడి పడింది. తల్లికి వందనం పథకం ద్వారా ఇద్దరు పిల్లలకు నగదు వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న మాకు చేదు వార్త ఎదురైంది. ఉపాధి కూలీగా నేను, పాన్ షాప్ పెట్టుకుని నా భర్త పిల్లలను పోషించుకుంటున్నాం. మా ఇంటిలో కేవలం ఒక ఫ్యాన్, టీవీ, మూడు లైట్లు మాత్రమే ఉన్నాయి. నెలకు 60 నుంచి 100 యూనిట్ల వరకు మాత్రమే విద్యుత్ వాడుతున్నాం. రూ.300 బిల్లు చెల్లిస్తే..300 యూనిట్లుగా తప్పుగా రాసుకుని తల్లికి వందనం పథకానికి అనర్హురాలిని చేశారు. – కోట సంధ్య, రేబాక గ్రామం, అనకాపల్లి మండలం