
‘తల్లికి వందనం చిరుద్యోగులకు అందించాలి’
అనకాపల్లి: తల్లికి వందనం పథకాన్ని అత్యంత తక్కువ జీతాలతో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశ, వెలుగు తదితర స్కీం కార్మికులతోపాటు విద్యా, వైద్య ఆరోగ్యశాఖలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరావు అన్నారు. స్థానిక సిటు కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చిరుద్యోగులందరికీ సంక్షే మ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనాన్ని చిరు ఉద్యోగులకు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, స్కీం వర్కర్లకు అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. వీరికి తల్లికి వందనాన్ని అందకుండా చేయడం అన్యాయమన్నారు.