అధికలోడుతో బండరాళ్ల రవాణా | - | Sakshi
Sakshi News home page

అధికలోడుతో బండరాళ్ల రవాణా

Mar 21 2025 1:11 AM | Updated on Mar 21 2025 1:11 AM

● లారీని అడ్డుకున్న గ్రామస్తులు

మునగపాక : ఒకవైపు భారీ వాహనాల రాకపోకలు సాగించొద్దంటూ అధికారులు చెబుతున్నా ఇవేమీ తమకు పట్టనట్లు లారీ యజమానులు వ్యవహరించడం విమర్శలకు తావిస్తుంది. ఒకవైపు పోలీసు ఉన్నతాధికారులు అధికలోడుతో వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా కొంతమంది లారీ డ్రైవర్లు అధికలోడుతో లారీలు నడుపుతున్నారు. గురువారం సాయంత్రం అనకాపల్లి నుంచి రాంబిల్లికి మునగపాక మీదుగా అధికలోడుతో బండరాళ్లతో వెళుతున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా అధికలోడుతో బండరాళ్లను ఎలా తీసుకువె వెళతావంటూ డ్రైవర్‌ను చుట్టుముట్టారు. భారీ వాహనాల రాకపోకల కారణంగా పలువురు గాయాలపాలవుతున్నా ఎందుకు స్పందించడం లేదంటూ స్థానికులు ముసిలినాయుడు, కొండలరావు తదితరులు డ్రైవర్‌ను నిలదీశారు. ఇప్పటికై నా లారీ డ్రైవర్లు ప్రభుత్వ నిబందనలను అనుసరించి వాహనాలు తిప్పాలని లేకుంటే సహించేదిలేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement