బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 20 ఏళ్ల తరవాత కమిటీ సభ్యులను నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులతో గురువారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికై న సయ్యపురెడ్డి సత్యనారాయణ మూర్తి,(నవీన్), ఎస్.లక్ష్మీనారాయణ, పి.రాధ, ఎస్. మహాలక్ష్మి, అప్పలనరస, కె.లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో శర్మ, నాయకులు దొండా గిరిబాబు, శ్రీరామూర్తి, రమేష్, పేరమ్మ, వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


