సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఏవోగా కుమారస్వామి | - | Sakshi
Sakshi News home page

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఏవోగా కుమారస్వామి

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

డీటీ నుంచి పదోన్నతి

కొయ్యూరు: స్థానిక తహశీల్దారు కార్యాలయంలో డిప్యూ టీ తహసీల్దారుగా పనిచేస్తున్న వి. కుమారస్వామికి తహసీల్దారుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను పాడేరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం పరిపాలనా అధికారిగా (ఏవో) నియమిస్తూ కలెక్టర్‌ నిషాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి అనంతరం తొలుత ఆయనను డుంబ్రిగుడకు బదిలీ చేయగా, ఆ తర్వాత పాడేరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోగా నియమిస్తూ కలెక్టర్‌ తాజా ఆదేశాలు ఇచ్చారు. కుమారస్వామి మూడు సంవత్సరాల క్రితం కొయ్యూరులో డీటీగా బాధ్యతలు చేపట్టి, తనదైన శైలిలో సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement