అచ్యుతాపురం రూరల్ : ఎన్సీసీ విభాగంలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యా ర్థిని లోకజ్ఞకు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకోవడం గర్వకారణమని వ్యవస్థాపకుడు కూండ్రపు మూర్తి శనివారం విద్యార్థిని లోకజ్ఞను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 25న విశాఖపట్నం ఎన్సీసీ గ్రూప్ హెడ్క్వార్టర్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డీడీజీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకుందన్నారు. ఎన్సీసీ కార్యకలాపాల్లో క్రమశిక్షణ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం, చురుకై న భాగస్వామ్యాన్ని ప్రదర్శించిన క్యాడెట్లలో ఆరుగురు బాలికలను డీడీజీ ప్రశంసాపత్రానికి ఎంపిక చేయగా వారిలో శ్రీ భవానీ విద్యానికేతన్ విద్యార్థిని లోకజ్ఞ చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ గ్రూప్ కమాండర్, వివిధ ఎన్సీసీ యూనిట్ల కమాండింగ్ అధికారులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.


