● ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్
పాడేరు : కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మా తృ వందన యోజన్( పీఎంఎంవీవై)ను గర్భిణులు, పాలిచ్చే తల్లులు సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మహి ళలు, శిశువుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార భద్రత, సంక్షేమం కోసం ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన మహిళలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ అవుతుందని చెప్పారు. రూ.5వేల ఆర్థిక సాయం రెండు విడతల్లో జమ అవుతుందని తెలిపారు. అర్హులైన మహిళలు సమీపంలో ఉన్న అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అర్హులైన ప్రతి మహిళ ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.


