బతుకులు
గుమ్మరేవుల మార్గంలో ధ్వంసమైన ప్రాంతం
సీలేరు: గూడెంకొత్తవీధి మండలంలోని గిరిజన గ్రామాల్లో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వాగులు, గెడ్డలు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లలేక గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. ప్రధాన రహదారులపై వంతెనల నిర్మాణం పెండింగ్లో ఉండటంతో, గత రెండేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


