నిందితులతో ఎస్ఐ తారకేశ్వరరావు
నాతవరం: విద్యుత్ వైర్ల కాయిల్స్ను అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు శనివారం తెలిపారు. నర్సీపట్నం, తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద వాహనాలు తనిఖీలు చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో వచ్చిన వి.బి.ఆగ్రహారం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా 30 కిలోల విద్యుత్ కాయిల్స్ పట్టుబడినట్టు చెప్పారు. వీటిని ఎక్కడో దొంగిలించి తునిలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్టుగా విచారణలో తెలిందన్నారు. ఇలాంటి విద్యుత్ సామగ్రి కొనుగోలు, విక్రయాలు చట్టరీత్యా నేరమన్నారు.


