● 15 మందికి స్వల్ప గాయాలు
ప్రమాదానికి గురైన బస్సులు
అచ్యుతాపురం రూరం: బ్రాండిక్స్కు ఉద్యోగులను తరలించే బస్సు రాంగ్రూట్లో ప్రయాణించి ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో 15మంది స్వల్ప గాయాలైనట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. శనివారం మధ్యాహ్నం చీమలాపల్లి సమీపంలో బ్రాండిక్స్ పరిశ్రమకు చెందిన బస్సు గాజువాక వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 15 మంది స్వల్పగాయాలైనట్టు సీఐ చంద్ర శేఖర్ రావు తెలిపారు.


