● హౌసింగ్ పీడీ బాబు
జి.మాడుగుల: గిరిజన గ్రామాల్లో గృహ నిర్మాణ సంస్థ అధ్వర్యంలో చేపడుతున్న నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆశాఖ పీడీ పి.బాబు ఆదేశించారు. మండలంలో మారుమూ గ్రామాలైన తాసురుబయలు, గొందిగూడ, భీమలోయ తదితర గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆదివాసీ గిరిజన లబ్ధిదారుల గృహ నిర్మాణాలను పరిశీలించారు. గృహ నిర్మాణా లు, బిల్లులు జాప్యంపై వివరాలు తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలు పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లిస్తామని పీడీ తెలిపారు.


