స్వల్పంగా పెరిగిన కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా మంచు ప్రభావం అధికంగా ఉంది. సోమవారం జి.మాడుగుల, అరకులోయల్లో 10.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలో ముంచంగిపుట్టులో 11.2 డిగ్రీలు, చింతపల్లిలో 11.8, పాడేరులో 11.9, పెదబయలులో 12.5, హుకుంపేటలో 12.9, కొయ్యూరులో 14.8, అనంతగిరిలో 15.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఆయన తెలిపారు.


