
ఉద్యోగాలకు 64 మంది ఎంపిక
అరకులోయ టౌన్: స్ధానిక ఆర్ఐటీఐలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 64 మంది ఎంపికై నట్లు ఏపీఎస్ఎస్డీసీ డీఎస్డీవో డాక్టర్ పి. రోహిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసి, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, కేర్ ఫర్ యూ, తదితర మొత్తం 10 కంపెనీలకు చెందిన ప్రతినిధులు, 140 మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికై న వారికి వివిధ కేటగిరీలను బట్టి నెలకు రూ. 10వేల నుంచి రూ.20వేల వరకు జీతం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో ఎన్.కె. మనోరమ, ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.