అప్పన్నకు విశేషంగా నిత్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు విశేషంగా నిత్య కల్యాణం

Jul 28 2025 7:51 AM | Updated on Jul 28 2025 7:51 AM

అప్పన్నకు విశేషంగా నిత్య కల్యాణం

అప్పన్నకు విశేషంగా నిత్య కల్యాణం

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు.

విశేషంగా గరుడసేవ

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో ఉదయం ఈ సేవను జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement