
పీవో చొరవతో పాఠశాల రూపురేఖలు మార్పు
కూనవరం: చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ చొరవతో కొండాయిగూడెం ఎంపీపీఎస్ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. వర్షానికి కారుతూ,శ్లాబ్ పెచ్చులు ఊడి పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. ఈ పరిస్థితిని పీవో అపూర్వభరత్కు గ్రామస్తులు వివరించారు. మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన పీవో ఈ విషయాన్ని సమరిటన్ ఫర్ది నేషన్ స్వచ్ఛంద సంస్థ అధినేత రామ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన సాఫ్ట్వేర్ సొల్యూషన్ వారి సహకారంతో రూ. 2 లక్షలు వెచ్చించి పాఠశాల భవనం సమస్యలు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఐటీడీఏ పీవో పునఃప్రారంభించారు. గ్రామస్తులు ఐటీడీఏ పీవోను, స్వచ్ఛంద సంస్థ రామ్ కుమార్ను సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో యూత్లీడర్ కరక రాజకుమార్, సోడె ముత్తయ్య, రాజబాబు, కన్నారావు, శ్రీను, రాము, నాగరాజు పాల్గొన్నారు.
స్వచ్ఛంద సంస్థ సహకారంతో
సమస్య పరిష్కారం