
డీపీఆర్వోగా బాలామాన్సింగ్ బాధ్యతల స్వీకరణ
సాక్షి,పాడేరు: జిల్లా పౌర సంబంధాలశాఖ అధికారిగా కె.బాలామాన్సింగ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సిబ్బంది, అధికారులు అభినందనలు తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పి.గోవిందరాజులను శ్రీకాకుళం డీపీఆర్వోగా ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీపై వెళ్తున్న పి.గోవిందరాజులను సమాచార,పౌరసంబంధాలశాఖ అధికారులు, ఉద్యోగులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా గోవిందరాజులు మాట్లాడుతూ అందరి సహకారంతో గిరిజన ప్రాంతంలో సేవలందించడం సంతోషంగా ఉందన్నారు. అధికారులు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పీఆరర్వో పి.రాములు, సీనియర్ సహాయకులు పి.శ్రీనివాసరావు, జూనియర్ సహాయకులు కె.సంధ్యారాణి, సిబ్బంది వరలక్ష్మి, పుష్ప, మోహన్ పాల్గొన్నారు.

డీపీఆర్వోగా బాలామాన్సింగ్ బాధ్యతల స్వీకరణ