
రంపుల గిరిజనుల ఆందోళన
● ఎండీయూ వాహనాలతో
రేషన్ పంపిణీ చేయాలని డిమాండ్
గూడెంకొత్తవీధి: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలని పెదవలస పంచాయతీ రంపుల గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎండీయూ వాహనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని మంగళవారం వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కొర్రా బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మూలంగా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చి బియ్యం తీసుకువెళ్లడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.