
90 మంది ఉపాధ్యాయులకు బదిలీలు
చింతపల్లి: మండలంలో వివిధ పాఠశాలలు నుంచి బదిలీపై వెళ్తున్న 90 మంది ఉపాధ్యాయులు ఆ ఉత్తర్వులను ఎంఈవో ప్రసాద్కు సోమవారం అందజేశారు. ఈ విద్యా సంవత్సంలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్ ఇటీవల నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్లో పాల్గొన్న వారికి ఆదివారం సాయంత్రానికి విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు సోమవారం బదిలీ అయిన ఉపాధ్యాయులు ఎంఈవో వద్ద రిలీవ్ ఉత్తర్యులు తీసుకుని నూతన పాఠశాలలో చేరారు. ఈ మండలంలో విధులు నిర్వహిస్తున్న 37 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కాగా మైదాన ప్రాంతం నుంచి 57 మంది ఉపాధ్యాయులు నూతనంగా మండలానికి వచ్చి విధుల్లో చేరారు.