90 మంది ఉపాధ్యాయులకు బదిలీలు | - | Sakshi
Sakshi News home page

90 మంది ఉపాధ్యాయులకు బదిలీలు

Jun 17 2025 5:12 AM | Updated on Jun 17 2025 5:12 AM

90 మంది ఉపాధ్యాయులకు బదిలీలు

90 మంది ఉపాధ్యాయులకు బదిలీలు

చింతపల్లి: మండలంలో వివిధ పాఠశాలలు నుంచి బదిలీపై వెళ్తున్న 90 మంది ఉపాధ్యాయులు ఆ ఉత్తర్వులను ఎంఈవో ప్రసాద్‌కు సోమవారం అందజేశారు. ఈ విద్యా సంవత్సంలో ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌ ఇటీవల నిర్వహించారు. ఈ నెల 11 నుంచి 15 వరకూ ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారికి ఆదివారం సాయంత్రానికి విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు సోమవారం బదిలీ అయిన ఉపాధ్యాయులు ఎంఈవో వద్ద రిలీవ్‌ ఉత్తర్యులు తీసుకుని నూతన పాఠశాలలో చేరారు. ఈ మండలంలో విధులు నిర్వహిస్తున్న 37 మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కాగా మైదాన ప్రాంతం నుంచి 57 మంది ఉపాధ్యాయులు నూతనంగా మండలానికి వచ్చి విధుల్లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement