
ఆదివాసీ గ్రామంలో పోలీసు సేవలు
గొలుగొండ: అల్లూరి పార్కుకు 8 కి.మీ. దూరంలో ఉన్న చుక్కపనుకులు ఆదివాసీ గిరిజన గ్రామాన్ని పోలీసులు సోమవారం కాలినడకన సందర్శించారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర్రావు తదితరులు కాలినడనక సుమారు 3 గంటలపాటు నడిచి గ్రామానికి చేరుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి డీఎస్పీ వివరాలు తెలుసుకున్నారు. పోడు వ్యవసాయం చేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి 14 కుటుంబాల వారం ఇక్కడ జీవిస్తున్నామని, ఏ కష్టం వచ్చినా కృష్ణదేవిపేట అడవుల గుండా నడిచివెళ్లాల్సిందేనన్నారు. వైఎస్సార్పీపీ ప్రభుత్వ హయాంలో సమకూర్చిన విద్యుత్ సదుపాయం తప్ప ఎటువంటి మౌలిక వసతులు లేవని గిరిజనులు తెలిపారు.
సేవా కార్యక్రమాలు
కృష్ణదేవిపేట హోమియో వైద్యాధికారి హేమలత గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. గ్రామంలో మహిళలకు రెండు చీరలు, మగవారికి పంచెలు, గొడుగులు అందజేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు యువతకు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. ఇక్కడి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, ఏ కష్టం వచ్చినా కృష్ణదేవిపేట ఎస్ఐకి తెలియపరచాలన్నారు.
దట్టమైన అడవిలో నడిచి వెళ్లిన
అధికారులు

ఆదివాసీ గ్రామంలో పోలీసు సేవలు