
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
● పీవో కట్టా సింహాచలం
రంపచోడవరం: విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మండలంలోని నల్గొండ గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలను సోమవారం ఆయ న ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినుల తో మాట్లాడి, పుస్తకాలు, ఇతర సామగ్రి అందా యా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు చేప్పే పాఠాలను అర్థం చేసుకుని, బాగా చదవాలన్నారు. పాఠశాల తెరిచిన తరువాత ఎంత మంది విద్యార్థినులు వచ్చారో ఆరా తీశారు.
రైల్వేస్టేషన్లో గేట్ నంబర్ 3 మూసివేత
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో చేపట్టనున్న అభివృద్ధి, నిర్మాణ పనుల నిమి త్తం గేట్ నంబర్ 3 ను సోమవారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు. ఈ గేటు ద్వారా సౌత్ ఎండ్లో ఉన్న 6–8 ప్లాట్ఫామ్లకు కూడా రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే ఈ గేట్ ద్వారా ప్లాట్ఫాం 2, 3లకు మాత్రం రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. మిగిలిన ప్లాట్ ఫామ్లకు చేరుకోవాల్సిన ప్రయాణికులు స్టేషన్లో ఉన్న ఇతర రెండు గేట్లను, లిఫ్ట్లను ఉపయోగించుకోవాలని సూచించారు.