
చంద్రబాబు పాలనలో రైతులకు తీరని అన్యాయం
రాజవొమ్మంగి : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోతీరని అన్యాయం జరుగుతోందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మండలంలోని జడ్డంగి గ్రామంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ హయాంలో ఈ పాటికే అన్నదాతకు రైతుభరో సా పేరిట పెట్టుబడి సాయం అందేదని చెప్పా రు. జూన్ మొదటి వారంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా 90 శాతం రాయితీపై నాణ్యమైన వరి విత్తనాలు రైతులకు పంపిణీ చేసేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని తెలిపారు. మండలంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా నేటికీ రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేయలేదన్నారు. రైతు ఇబ్బందులకు గురవుతున్నా అధికార యంత్రాగానికి చీమ కుట్టినట్టు కూడా లేదని తెలిపారు. ఏడాది పాలనలో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండా హామీలను తుంగలో తొక్కారని చెప్పారు. జడ్డంగి సర్పంచ్ కొంగర మురళీకృష్ణ, వైస్ ఎంపీపీ జుర్రా రాజేశ్వరి, నాయకులు కామేష్, దుర్గాప్రసాద్, నాగులాపల్లి కుశరాజు, వీరబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే
నాగులపల్లి ధనలక్ష్మి