
విస్తృతంగా పోలీస్ తనిఖీలు
వై.రామవరం: సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో, మండల కేంద్రం వై.రామవరంలో సోమవారం నిర్వహించిన సంతలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించా రు. సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారంతో సీఐ నరసింహమూర్తి ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో డాగ్స్క్వాడ్తో తనిఖీలు జరిపారు. వారపు సంతకు సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చివెళ్లే వాహనాలలో ప్రయాణిస్తున్న వారిని, వాటిలో రవాణా చేస్తున్న సామగ్రిని పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అపరిచితులపై నిఘా ఉంచారు.