
కాలువల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేదు..
ఏమాయికుంట శివారు గురుదేవ్ చెరువు కింద హీరాపూర్లో నాకు నాలుగెకరాల సాగు భూమి ఉంది. యాసంగిలో పంటలు పండించాలంటే తప్పనిసరి ఆ చెరువు నీళ్లే దిక్కు. అయితే ఇప్పటివరకు నిండకపోవడంతో వచ్చే సాగు ఎలా చేపట్టాలో అర్థం కావట్లే. కాల్వల ద్వారా నీళ్లొచ్చే పరిస్థితి కనిపించట్లే. – పఠాన్ అన్వర్, రైతు, హీరాపూర్, ఇంద్రవెల్లి మండలం
చాలా చెరువులు నిండలేదు..
జిల్లాలో ఇంకా అనేక చెరువులు పూర్తిస్థాయిలో నిండలేదు. భారీ వర్షాలు కురిస్తే నిండే అవకాశం ఉంది. యాసంగిలో ఆయకట్టు భూములకు నీళ్లందించేలా చూస్తాం.
– విఠల్, ఈఈ, నీటిపారుదల శాఖ, ఆదిలాబాద్